న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఉద్యోగులకు గూగుల్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఉద్యోగులకు అందిస్తున్న ఉచిత ఫలహారాలు (స్నాక్స్), భోజనం, లాండ్రీ సేవలు, ఫిట్నెస్ సెంటర్లు, మసాజ్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఏడాది దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.