న్యూఢిల్లీ : రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మాజీ జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన నాగ్పూర్లోని కింగ్స్వే హాస్పిటల్లో చేరారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 58,993 కరోనా కేసులు రికార్డవగా.. 301 మరణాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ముంబైలో 9,200 కేసులు, 35 మరణాలు రికార్డయ్యాయి.