చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ప్రకాష్ సింగ్ బాదల్కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రకాష్ సింగ్ బాదల్ను లూథియానాలోని ఆసుపత్రిలో బుధవారం అడ్మిట్ చేశారు. తన తండ్రికి తేలికపాటి జ్వరం ఉన్నదని, ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారని బాదల్ కుమారుడు, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 2,82,970 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కు, మొత్తం కేసుల సంఖ్య 3,79,01,241కు చేరింది. కరోనాతో 441 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,87,202కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.