బెంగుళూరు: కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఇవాళ ఆత్మహత్య చేసుకున్నది. బెంగుళూరులోని వసంత్నగర్లోని అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆమె తన రూమ్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వయసు 30 ఏళ్లు. వృత్తి రీత్యా ఆమె డాక్టర్. యడ్యూరప్ప కూతురు పద్మావతి కుమార్తె సౌందర్య. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇంటి పనిమనిషి ఇచ్చిన సమాచారం మేరకు సౌందర్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్లో పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నారు.
ఉదయం 10 గంటలకు పనిమనుషులు కాలింగ్ బెల్ కొట్టినా సౌందర్య తలుపు తెరవలేదు. దీంతో ఆమె భర్త నిరంజన్కు వాళ్లు సమాచారం ఇచ్చారు. ఆయన కూడా సౌందర్య ఫోన్కు పదేపదే రింగ్ చేశాడు. ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వచ్చి రూమ్ తలుపులు తీశాడు. ఇతరుల సహాయంతో సౌందర్యను హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. నిరంజన్ కూడా వృత్తి రీత్యా డాక్టరే. తొమ్మిది నెలల చిన్నారితో బెంగుళూరు అపార్ట్మెంట్లో సౌందర్య జీవిస్తోంది.
అయితే ప్రెగ్నెన్సీ తర్వాత ఆమె మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 2018లో నిరంజన్ను సౌందర్య పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇంట్లో వారంతా షాక్లో ఉన్న కారణంగా.. ఇప్పుడే ఆ కేసులో విచారణ చేపట్టలేదని, అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత కేసు విచారణ చేపడుతామని పోలీసులు తెలిపారు.