చెన్నై/రాంచీ, జూలై 5: వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. అయితే యూసీసీ విషయంలో ఆ పార్టీకి మిత్రపక్షాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా తమిళనాడులోని మిత్రపక్షం అన్నాడీఎంకే ఝలక్ ఇచ్చింది. యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉన్నదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కే పళనిస్వామి పునరుద్ఘాటించారు.
ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్భవన్ సమీపంలో గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆదివాసీ సమన్వయ సమితి(ఏఎస్ఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్దయెత్తున పాల్గొన్నారు. యూసీసీతో గిరిజనుల ఉనికికి ముప్పు ఏర్పడుతుందని నేతలు పేర్కొన్నారు. యూసీసీపై తమ అభ్యంతరాలను లా కమిషన్కు పంపినట్టు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) బుధవారం తెలిపింది. చట్ట పరిధి నుంచి గిరిజనులతో పాటు అన్ని మైనారిటీ మతాలను మినహాయించాలని డిమాండ్ చేసింది.