బెంగళూరు, ఆగస్టు 8: తప్పుడు సమాచారం, విద్వేష ప్రసంగాలను వ్యాప్తి చేసే న్యూస్, సోషల్ మీడియా ఛానళ్లకు నిధులు ఇవ్వడం ఆపేయాలని ఐఐఎం-బెంగళూరు మాజీ, ప్రస్తుత బోధనా సిబ్బంది కార్పొరేట్ ఇండియాను కోరారు. 11 మంది ప్రస్తుత, ఆరుగురు మాజీ టీచింగ్ ఫ్యాకల్టీ ఈ మేరకు కార్పొరేట్ కంపెనీల అధిపతులకు బహిరంగ లేఖ రాశారు.
మైనార్టీలపై బహిరంగంగానే విద్వేష వ్యాఖ్యలు చేయడం సాధారణమైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సామాజిక, ఆర్థిక అస్థిరతకు కారణమయ్యే హింస, విద్వేషాలను అరికట్టడంలో కార్పొరేట్ కంపెనీలు కీలక పాత్ర పోషించాలని వారు కోరారు.