న్యూఢిల్లీ: ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు(Press and Registration Bill)కు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. బ్రిటీష్ కాలం నాటి ప్రెస్, రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దు చేసింది. గత వర్షాకాల సమావేశాల్లోనే ప్రెస్, రిజిస్ట్రేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం దక్కింది. ఇక ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. కొత్తగా తీసుకువచ్చిన ప్రెస్ బిల్లు ప్రకారం.. విదేశీ పత్రికలకు చెందిన ఫాసిమైల్ ఎడిషన్లను ఇండియాలో ఓపెన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద రిజిస్ట్రేషన్తో విదేశీ పత్రికలు ఇక నుంచి దేశంలో ప్రింట్ చేసుకోవచ్చు. ప్రెస్, రిజిస్ట్రేషన్ బిల్లు గురించి లోక్సభలో కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ మాట్లాడారు. నేరాలను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమన్నారు.1867 నాటి చట్టంతో ప్రింటర్లు, పబ్లిషర్లను నొక్కి పెట్టేందుకు బ్రిటీషనర్లు ప్రయత్నించారు. అయితే 1867 పీఆర్బీ యాక్టులో ఉన్న పెనాల్టీ విధానాన్ని రద్దు చేశారు.