ఒట్టపాలమ్: రిటైర్డ్ ఉద్యోగికి కేరళ సర్కారు షాకిచ్చింది. మాజీ ఉద్యోగికి రావాల్సిన పెన్షన్లో ప్రతినెల రూ.500 కట్ చేసింది. ఆ రాష్ట్ర మాజీ స్పీకర్ పీ శ్రీరామకృష్ణ, మాజీ విద్యుత్తుశాఖ మంత్రి ఎంఎం మణిపై సోషల్ మీడియా(Social Media)లో రిటైర్డ్ ఉద్యోగి వీపీ ముహమ్మద్అలీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగిపై ప్రభుత్వం కక్ష కట్టింది.
పట్టాంబిలోని విద్యాశాఖలో సీనియర్ సూపరింటెండెంట్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో మహమ్మద్ అలీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్టు పెట్టారు. పట్టాంబి పోలీసులు కేసు బుక్ చేశారు. ఆ కేసు ఆధారంగా అతనికి అప్పట్లోనే 3వేల జరిమానా విధించారు. విచారణ జరిపించిన విద్యాశాఖ.. మహమ్మద్ అలీ పోస్టును తప్పుపట్టింది. ప్రతి నెల పెన్షన్లో రూ.500 కోత విధించాలని ప్రభుత్వం తాత్కాలిక నిర్ణయం తీసుకున్నది.
పొరపాటును పోస్టు చేసినట్లు ఆ ఉద్యోగి ఒప్పుకున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిలీజ్ చేయాలని అతను ప్రభుత్వాన్ని కోరాడు. కొన్ని రోజుల తర్వాత రెండు పోస్టులను డిలీట్ చేశాడు. కేరళ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘంలో అతను సభ్యుడిగా ఉన్నారు.