సిమ్లా: యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. (Professor Rapes Student) బాధితురాలి ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చి తమ కస్టడీలోకి తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఈ సంఘటన జరిగింది. సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని రీసెర్చ్ టాపిక్ మార్చుకోవాలని భావించింది. దీని కోసం 44 ఏళ్ల కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజేందర్ కుమార్ అనుమతి కోరింది. అయితే లైంగిక కోరిక తీర్చితే సహకరిస్తానని ఆ ప్రొఫెసర్ చెప్పాడు. ఆమెను హోటల్కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కాగా, బాధిత విద్యార్థిని మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో దీని గురించి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రొఫెసర్ రాజేందర్ కుమార్పై అత్యాచారం సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా మార్చి 30 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది.