బెంగుళూరు: సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. (Case Against Tejasvi Surya) ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఈ విషయం తెలిపారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టు చేస్తున్నారని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని శత్రుత్వాన్ని వ్యాప్తి చేశారంటూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారు. మార్చి 19న ఎక్స్తోపాటు యూట్యూబ్లో ఇలాంటి పోస్టులు చేశారని విమర్శించారు. ఓటర్లను ప్రభావితం చేయడంతోపాటు వర్గాల మధ్య మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు.
కాగా, ఈ ఫిర్యాదు ఆధారంగా ఈసీ చర్యలు చేపట్టింది. మార్చి 20న హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మత విశ్వాసాలను అవమానించడం, హాని కలిగించే చర్యలకు పాల్పడడం వంటి సెక్షన్లు మోపినట్లు అధికారులు తెలిపారు.