కొట్టాయం: కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్కు పాల్పడిన అయిదుగురు విద్యార్థులను గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను.. మూడు నెలలుగా సీనియర్లు వేధిస్తున్నట్లు తెలిసింది. ఆ కేసులో సెకండ్ ఇయర్ నర్సింగ్ స్టూడెంట్స్ సామ్యూల్ జాన్సన్, జీవా ఎన్ఎస్తో పాటు మూడవ సంవత్సరం చదువుతున్న రాహుల్ రాజ్, రిజిల్జిత్, వివేక్ ఎన్వీ దోషులుగా ఉన్నారు. ర్యాంగింగ్ చట్టం కింద ఆ విద్యార్థులపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆ అయిదుగుర్ని కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.
పోలీసుల ప్రకారం.. ఫస్ట్ ఇయర్కు చెందిన ముగ్గురు విద్యార్థులు సీనియర్లపై ఫిర్యాదు చేశారు. సీనియర్లు తమ దుస్తుల్ని విప్పించి.. తమ మర్మాంగాలకు డంబుల్స్ కట్టేవారని జూనియర్లు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో కంపాస్లతో గుచ్చి.. గాయాలపై లోషన్ పోసేవారని స్టూడెంట్స్ తెలిపారు. మెన్స్ హాస్టల్లో ర్యాగింగ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం ఖరీదు చేసేందుకు జూనియర్ల నుంచి ఆ అయిదుగురు సీనియర్లు 800 వసూల్ చేసినట్లు చెప్పారు. జూనియర్లను మద్యం తాగేలా వేధించి,ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించేవారు.
అయితే డబ్బులు ఇవ్వలేదని ఇటీవల ఓ జూనియర్ స్టూడెంట్ను సీనియర్ కొట్టాడు. ఈ విషయాన్ని తమ పేరెంట్స్కు చెప్పడంతో.. వాళ్ల సూచన మేరకు పోలీసు ఫిర్యాదు ఇచ్చారు. కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిధిలో నర్సింగ్ కాలేజీ పనిచేస్తున్నది.