దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం (ధ్యాన్యపు ఏటీఎం) ఇది. గురుగ్రామ్లో దీన్ని ఏర్పాటు చేశారు. 5-7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం/గోధుమలను ఈ ఏటీఎం అందిస్తుంది. రేషన్ దుకాణాల్లో ప్రజలు గంటలతరబడి నిలబడకుండా ఉండేందుకే ఈ ఏటీఎంను తీసుకొచ్చినట్టు హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా బుధవారం తెలిపారు.