డెహ్రడూన్: హరిద్వార్ ధర్మ సంసద్ విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులో తొలి అరెస్టు నమోదైంది. జితేంద్రనారాయణ్ త్యాగి అలియాస్ వసీం రజ్వీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. హరిద్వార్లో జరిగిన హిందూ మత కార్యక్రమాల సందర్భంగా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. డిసెంబర్ 17న చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు అరెస్టులు జరుగకపోవడంతో పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో కేంద్రానికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.