భోపాల్: ప్రైవేట్ బస్సు యజమాని ఒక కండక్టర్ను ఉద్యోగం నుంచి తొలగించాడు. దీంతో అతడు వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. బస్సు ఎలక్ట్రిక్ బోర్డు సెటింగ్ను మార్చేశాడు. ఆ సంస్థను తిడుతూ బూతు పదాలు డిస్ప్లే చేశాడు. దీంతో ఇది చూసిన వారంతా షాకయ్యారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన జరిగింది. సతీష్ సుఖేజా అనే వ్యక్తి ‘సుఖేజా’ పేరుతో ప్రైవేట్ బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నాడు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో సల్మాన్ ఖాన్ అనే కండక్టర్ను ఉద్యోగం నుంచి తొలగించాడు.
అయితే ఉద్యోగం నుంచి తొలగించిన బస్సు ఓనర్పై ప్రతికారం తీర్చుకోవాలని ఆ కండక్టర్ భావించాడు. ఈ నెల 16న బస్సు ముందు ఉన్న ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు సెట్టింగ్ను మార్చేశాడు. ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తుంది అనే దానికి బదులు సుఖేజా సంస్థను తిడుతూ బూతు పదాలు కనిపించేలా సెట్ చేశాడు. దాని పాస్వర్డ్ కూడా మార్చేశాడు.
కాగా, ఆ బస్సు సత్నా నుంచి ఇండోర్కు వెళ్లేందుకు సిద్ధం కాగా, డిస్ప్లే బోర్డుపై బూతు పదాలు కనిపించాయి. ఇది చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. బస్సు డ్రైవర్కు ఈ విషయం చెప్పడంతో చివరకు ఆ డిస్ప్లే బోర్డును ఆఫ్ చేశారు.
మరోవైపు ఈ సంఘటనపై బస్సు సంస్థ మేనేజర్ స్పందించారు. తొలగించిన ఉద్యోగి సల్మాన్ ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిస్ప్లే బోర్డు పాస్వర్డ్ కేవలం అతడికి మాత్రమే తెలుసని, ఈ పని అతడే చేసి ఉంటాడని ఆరోపించారు. కొత్త డిస్ప్లే బోర్డు వ్యయం రూ.55,000 ఉంటుందని, దీని కోసం రెండు రోజులు సర్వీసులు ఆపేసి ముంబైకి ఆ బస్సును పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, కొందరు ప్రయాణికులు తమ మొబైల్ఫోన్లో రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
From Indore, a Bus conductor was laid off after being abused by some Sukheja Bus Services. The conductor decided to land one final blow by changing the display's password a new display costs 55000 and a two day journey to Bombay.
Revenge served cold. pic.twitter.com/1gpsPzoKtw— Roshan Abbas (@Roshan_Abbas_) October 19, 2022