కోల్కత్తా హల్దియాల ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ క్యాంపస్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. 35 మంది తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఘటన జరిగే కొద్ది గంటల మునుపు ఆయిల్ కార్పొరేషన్ క్యాంపస్లో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.