న్యూఢిల్లీ: దేశంలో మహిళల సంతానోత్పతిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గడిచిన పదేండ్లలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్ఆర్) 20% తగ్గిపోయినట్టు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-2020 తెలిపింది. అక్షరాస్యత, అత్యాధునిక గర్భనిరోధక సాధనాల వాడకం పెరుగడంతో సంతానోత్పత్తి రేటు తగ్గిపోయింది.
2008-2010 మధ్య 86.1 శాతంగా ఉన్న సంతానోత్పత్తి రేటు 2018-2020 మధ్య 68.7శాతానికి పడిపోయింది. సంతానోత్పత్తి క్షీణత పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాం తాల్లో ఎక్కువగా ఉన్నట్టు ఎస్ఆర్ఎస్-2020 డాటా వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో జీఎఫ్ఆర్ 20.2 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 15.6 శాతంగా ఉంది.