రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్ని, దాన్ని అదుపు చేయకుంటే భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న బొగ్గు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి 1.36 లక్షల కోట్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బొగ్గు గనులు రాష్ట్ర హక్కు అని, ఒకవేళ తమ వాటా చెల్లించకుంటే గనుల చుట్టూ బారికేడ్లు పెడుతామని ఆయన హెచ్చరించారు.