అదృష్టం తన్నుకుంటూ వచ్చిందంటే ఇదే మరి. మధ్యప్రదేశ్లోని ఓ కూలికి పన్నా ప్రాంతంలో మైనింగ్ చేస్తుండగా.. ఓ డైమండ్ దొరికింది. 11.88 క్యారెట్ల విలువ చేసే డైమండ్ అది. ఈ పన్నా ప్రాంతం డైమండ్లకు ఎంతో ప్రసిద్ధి గాంచింది. మైనింగ్ లో ప్రతాప్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ సమయంలోనే ఆయనకు డైమండ్ దొరికింది.
అయితే… రాబోయే ఆక్షన్లలో దీన్ని వేలం వేస్తామని అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించే ఓ ధరను నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కూలీ ప్రతాప్ సింగ్ యాదవ్ స్పందించాడు.
నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. చిన్న పొలం కూడా వుంది. కూలీగా కూడా పనిచేస్తున్నాను. గత మూడు నెలలుగా మైనింగ్ లో కూలీగా పనిచేస్తున్నాను. పని చేస్తుండగా… ఓ డైమండ్ దొరికింది. అని కూలీ ప్రతాప్ సింగ్ యాదవ్ స్పందించాడు.