ఛత్రపతి శంభాజీనగర్: మురిపెంగా పెంచుకుంటున్న 300 బత్తాయి చెట్లను స్వయంగా ఆ రైతే చేతులారా నరికేసిన సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో చోటు చేసుకున్నది. నీటి ఎద్దడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు ఆవేదనగా చెప్పారు. ముర్మా గ్రామ రైతు రాజేంద్ర తన పొలంలో 11 ఏండ్ల క్రితం నాటిన బతాయి చెట్లను నరికేశారు. తనకు మరో మార్గం లేదని, తన రెండు బావులు గత రెండు నెలలుగా పూర్తిగా ఎండిపోయాయన్నారు.