Kamal Haasan | వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ సూచించారు. బుధవారం చెన్నై అన్నానగర్లోని ఓ హోటల్లో పార్టీ రాష్ట్ర నిర్వాహకులు, జిల్లా నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఈ సమావేశంలో కమల్ చర్చించారు. ఈ సందర్భంగా వారికి పలు సలహాలు, సూచనలు చేశారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా, లేక ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు వంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బూత్ కమిటీల వారీగా పార్టీని బలోపేతం చేయాలని వారికి సూచించారు.
అనంతరం మీడియాతో కమల్ హాసన్ మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని తమ నేతలకు సూచించినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని తెలిపారు. మరోవైపు ఈసారి డీఎంకేతో కలిసి కమల్ ముందుకు సాగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న ఐజేకే ఈసారి బీజేపీతో జత కట్టేందుకు రెడీ అవుతోంది. దీంతో కమల్.. స్టాలిన్తో జతకట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
தலைவர் @ikamalhaasan அவர்களுடன் மாவட்ட செயலாளர்கள் கூட்டம் சிறப்பாக நடைபெற்றது.
கூட்டத்தில் கட்சி கட்டமைப்பை விரிவுபடுத்துவது, பாராளுமன்ற தேர்தலுக்கு தயார் செய்வது குறித்து கலந்தாலோசிக்கப்பட்டது.#MakkalNeedhiMaiam #KamalHaasan #MNMTweets pic.twitter.com/nLymriajrH— Makkal Needhi Maiam | மக்கள் நீதி மய்யம் (@maiamofficial) November 16, 2022