Rameshwaram Cafe Blast | బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ లోని ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు కేసులో కీలక కుట్రదారుగా అనుమానిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రాష్ట్రాల్లో విస్త్రుతంగా గాలించిన తర్వాత అతడ్ని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ నెల ఒకటో తేదీన జరిగిన కేఫ్ బాంబు పేలుడు పలువురు వ్యక్తులు గాయపడ్డారు.
ఈ నెల మూడో తేదీన ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు మూడు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కర్ణాటకలోని 12 చోట్ల, తమిళనాడులో ఐదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకచోట దాడులు చేశాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులకు సహాయం చేసిన మజుమ్మిల్ షరీఫ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ముస్సావిర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మథీన్ తహా గాగుర్తించారు. బాంబు దాడికి నెల రోజుల ముందు నుంచి ముస్సావిర్, అబ్దుల్లు చెన్నైలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.