నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు తమదైన శైలిలో కేంద్ర ఆర్థిక మంత్రిని ఆటాడుకున్నారు. ఆ కామెంట్లు ఇవీ.. టైటానిక్ మునగలేదు.. సముద్రమే ఉప్పొంగింది. వాతావరణం మారటం లేదు.. మనమే మారుతున్నాం. నాకు మార్కులు తగ్గలేదు.. మిగతావాళ్లకే నాకంటే ఎక్కువ వచ్చాయి. భారత భూభాగం తగ్గటం లేదు.. చైనానే తన సరిహద్దును పెంచుకుంటూ పోతున్నది. ఇలాంటి ఆర్థిక మంత్రి ఉంటే భారత్ ఐదు ట్రిలియన్ల ఎకానమీని సాధించినట్టే.