న్యూఢిల్లీ, మే 22: ఢిల్లీలోని కుతుబ్మినార్లో తవ్వకాలు చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కి ఆదేశాలు ఇచ్చిందని ఆదివారం వార్తలు వచ్చాయి. కుతుబ్మినార్ ప్రాంతాన్ని మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ శనివారం సందర్శించారు.
కుతుబ్మినార్ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడా? లేక చంద్రగుప్త రాజు విక్రమాదిత్య నిర్మించాడా? అనేది తేల్చేందుకు తవ్వకాలు చేపట్టాలని ఏఎస్ఐని ఆదేశించారని వార్తలు ప్రచారమయ్యాయి. అయితే మీడియా వార్తలను కేంద్ర సాంస్కృతిక శాఖ జి కిషన్రెడ్డి ఖండించారు. కుతుబ్మినార్ ఒకప్పుడు విష్ణు స్తంభం అని, దాని కొంత భాగం కూల్చి కుతుబ్మినార్గా మార్చారని హిందూత్వ సంస్థలు పేర్కొంటున్నాయి.