న్యూఢిల్లీ : దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏండ్ల మైలురాయిని చేరుకుంటున్న ఈ తరుణంలో.. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో, వారి ధైర్యం, దేశభక్తిని ప్రేరణగా తీసుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో దేశ పురోగతి, శ్రేయస్సు కోసం పాటుపడటం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఆశిస్తున్నానని తెలిపారు. దేశంలోని అన్ని స్థాయిల ప్రజలకు అభివృద్ధి ప్రయోజనాలు అందిచడం, గౌరవప్రదమైన జీవితాన్ని అందేలా చూడటం బాధ్యతగా తీసుకోవాలని, మనకున్న దాన్ని నలుగురితో పంచుకోవడం, నలుగురి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం వంటి భారతీయ విలువలను ఆదర్శంగా తీసుకుని.. మన పౌరులందరికీ భద్రత, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే రాజ్యంగపరమైన ఆదర్శాన్ని సాధించేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని మన అంతర్గత శక్తులను తిరిగి ఆవిష్కరించుకునేందుకు, మన ప్రజల అపారమైన సామర్థ్యాన్ని గ్రహించేందుకు, వివిధ దేశాల సహకారంలో భారతదేశానికి సముచిత స్థానం సంపాదించుకునేందుకు అందరం పునరంకితమయ్యే దిశగా ప్రతిన బూనుదామని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్కు ఐసీసీ మార్గదర్శకాలు
తాలిబాన్లకు పాక్ జనరల్స్ మద్దతు : మాజీ ఎంపీ ఆరోపణ
ఆఫ్ఘాన్ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా
ఇంగ్లండ్లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..