న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: లండన్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్లో లోపం బయటపడింది. ఆ విమానానికి చెందిన పైలట్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లో లోపాన్ని గుర్తించటంతో పెను ప్రమాదం తప్పింది! దీంతో బోయింగ్ 787-8 విమాన ప్రయాణాన్ని వెంటనే నిలిపివేసినట్టు ‘ఎయిరిండియా’ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సమస్యను విమాన తయారీదారు బోయింగ్ కంపెనీకి తెలియజేశామని, బోయింగ్తో కలిసి సమస్యసు పరిశీలిస్తున్నట్టు ఎయిరిండియా పేర్కొన్నది.
తాజా ఈ ఘటన.. దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటనను గుర్తుచేసింది. ఆనాటి విమాన ప్రమాదానికి ‘ఫ్యూయల్ స్విచ్’లే కారణమని పలు నివేదికలు పేర్కొన్నాయి. తాజా ఘటన వివరాలను డీజీసీఏకు తెలియజేశామని, డీజీసీఏ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. తాము నడుపుతున్న ‘బోయింగ్ 787’ అన్ని విమానాల్లోని ఇంధన నియంత్రణ స్విచ్లను తనిఖీ చేశామని ఎయిరిండియా తెలిపింది. అందులో ఎలాంటి సమస్యలూ బయటపడలేదని పేర్కొన్నది.