న్యూఢిల్లీ: యూపీలోని మథుర రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ఫామ్ మీదకు రైలు(Train Derails) ఎక్కిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి రిలీజైంది. ఈఎంయూ రైలు ఇంజిన్లో ఉన్న సీసీటీవీ దృశ్యాల్లో ప్రమాదంపై క్లారిటీ ఇచ్చింది. రైలు ప్రమాదానికి ముందు ఆ ఇంజిన్లోకి ఓ ఉద్యోగి ఎంటర్ అయ్యారు. అప్పటికే వీడియో కాల్లో ఉన్న ఆ ఉద్యోగి.. తన భుజాలకు ఉన్న బ్యాగును ఇంజిన్ త్రటల్పై పెట్టాడు. అయితే బ్యాగ్ ప్రజెర్ వల్ల.. ఇంజిన్ త్రటల్ ఆన్ అయ్యింది. ఆ తర్వాత ఇంజిన్ ఫార్వర్డ్ పొజిషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఉద్యోగిని సచిన్గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఇంజిన్లో ఉన్న ఉద్యోగి మద్యం తాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అయిదుగుర్ని సస్పెండ్ చేసినట్లు డీఆర్ఎం తేజ్ ప్రకాశ్ అగర్వాల్ తెలిపారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఉద్యోగి సచిన్ను ప్రస్తుతం మెడికల్ టెస్టు కోసం పంపారు. అతని రక్తం శ్యాంపిళ్లను పరీక్షిస్తున్నారు.
मथुरा ट्रेन हादसे का CCTV
रेलवे कर्मचारी वीडियो कॉल पर था,
नशे में थ्रोटल पर रखा बैग
ट्रेन प्लेटफॉर्म तोड़ते हुए ऊपर चढ़ी #Mathura #train #CCTV pic.twitter.com/beyDj87WeH
— PRIYA RANA (@priyarana3101) September 28, 2023