తిరువనంతపురం: సుగంధ ద్రవ్యాలు, అనుబంధ ఉత్పత్తుల ప్రాసెసింగ్, వాటి వ్యాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కోసం కేరళలో ‘సుగంధ ద్రవ్యాల’ పార్క్ ఏర్పాటైంది. ఇడుక్కి జిల్లా తుందాన్గంద వద్ద ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల పార్క్ను శనివారం సీఎం విజయన్ ప్రారంభించారు.
రూ.20 కోట్లతో 15 ఎకరాల్లో పార్క్ మొదటి దశ నిర్మాణ పనుల్ని కిన్ఫ్రా పూర్తి చేసింది. ఈ సందర్భంగా సీఎం విజయన్ మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలు సాధించటంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దృష్టిసారించాలన్నారు.