చెన్నై, నవంబర్ 28: ఐఐటీ మద్రాస్ మరో కొత్త ఆవిష్కరణకు వేదికైంది. విద్యార్థులు సోమవారం ఇన్స్టిట్యూట్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫార్ములా రేసింగ్ కారును ఆవిష్కరించారు. దీనికి ‘ఆర్ఎఫ్23’గా పేరుపెట్టారు. 45 మంది విద్యార్థులతో కూడిన ‘టీమ్ రఫ్తార్’ ఈ కారును తయారుచేసింది. డిజైన్, తయారీ, టెస్టింగ్పై విద్యార్థులు దాదాపు ఏడాది పాటు కష్టించి పనిచేశారని ఐఐటీ మద్రాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.