న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) ని చీల్చి, తన వర్గంతో కలిసి రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారులో చేరిన అజిత్పవార్.. ఇప్పుడు పార్టీ, పార్టీ గుర్తు తనదేనని క్లెయిమ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ను ఆశ్రయించాడు. అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తమదేనని, పార్టీతోపాటు పార్టీ గుర్తు కూడా తమదిగా గుర్తించాలని కోరుతూ అజిత్ పవార్ పిటిషన్ దాఖలు చేశాడు.
మరోవైపు, ఎన్సీపీని వదిలి వెళ్లి పార్టీ అభీష్ఠానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘంలో కేవియట్ పిటిషన్ వేశాడు. ఈ రెండు పిటిషన్లను కూడా కేంద్ర ఎన్నికల విచారణకు స్వీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.