న్యూఢిల్లీ: రాజ్యసభలోని 27 స్థానాలకు, మూడు రాష్ట్రాల్లో శాసన మండలి స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)విడుదల చేసింది. ఆయా స్థానాల్లో ఎన్నికల కోసం ఈనెల 18న పోలింగ్ను నిర్వహిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది.
అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీఐ తెలిపింది. ఎన్నికల షెడ్యూల్లో తెలిపిన వివరాల ప్రకారం, అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ జూన్ 1తో మొదలై.. జూన్ 8తో ముగుస్తుంది. రాజ్యసభలోని 24 స్థానాల్లో ‘ద్వైవార్షిక ఎన్నికలు’ కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ర్టాల్లోని స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఈసీ పేర్కొన్నది.