Thane | థాణే: చేతబడి చేస్తున్నాడ నే నెపంతో 75 ఏండ్ల వృద్ధుడిని కొం దరు నిప్పులపై నాట్యం చేయించిన అమానుష ఘటన ఈ నెల 4న మ హారాష్ట్రలోని థాణే జిల్లాలో జరిగిం ది. గురువారం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మురద్ తాలుకా కెర్వెలె గ్రామంలో గుడి వద్ద మత కార్యక్రమం జరుగుతున్నప్పుడు 15-20 మంది గ్రామస్థులు వృద్ధుడి ఇంట్లోకి ప్రవేశించి అతడిని గుడి వద్దకు లాక్కొచ్చారు. చేతబడి చేస్తున్నాడని ఆరోపించి కొందరు అతడిపై దాడి చేశారు. బలవంతంగా అతడితో నిప్పులపై నాట్యం చేయించారు.