న్యూఢిల్లీ: కారు పార్కింగ్ వివాదంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వృద్ధుడు దంపతులను కర్రతో కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సంత్ నగర్ ప్రాంతంలోని అమర్ కాలనీలో కారు పార్కింగ్ విషయంపై పొరుగున ఉన్న రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయగా ఒక వృద్ధుడు కర్రతో కారు యజమానిని పలుసార్లు కొట్టాడు (Elderly Man Beats Neighbour). అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి భార్యపై కూడా దాడి చేశాడు. ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు కూడా ఆ దంపతులను తిట్టడంతోపాటు వారిపై చేయి చేసుకున్నారు.
కాగా, ఈ గొడవ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. దుష్యంత్ గోయెల్ ఆయన భార్య మోనా గోయెల్, కౌశికి నుంచి ఫిర్యాదు అందుకున్నారు. వారిపై దాడి చేసిన వృద్ధుడు దల్జీత్ సింగ్, అతడి కుమారుడు హర్జాప్ సింగ్, భార్య కుద్రత్ కౌర్, ఇతర కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వృద్ధుడు దల్జీత్ సింగ్, అతడి కుమారుడ్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మరోవైపు, నిందితులైన ముగ్గురు మహిళల ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరిస్కరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి రక్షణ పొందినట్లు చెప్పారు. దీంతో మిగతా ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kalesh b/w Two Neighbour’s in New Delhi over Car Parking issuepic.twitter.com/A21HCcknf6
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023