సూరత్: గుజరాత్లోని ఓ ట్యూషన్ సెంటర్లో కరోనా కలకలం సృష్టించింది. సూరత్ నగరంలోని ఓ ట్యూషన్ పాయింట్లో శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 8 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలింది. ట్యూషన్కు రెగ్యులర్గా వచ్చే ఒక విద్యార్థికి ఈ నెల 7న కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇవాళ మిగిలిన అందరు విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 8 మందికి పాజిటివ్గా తేలింది.
దాంతో ముందు జాగ్రత్త చర్యగా ట్యూషన్ సెంటర్ను మూసివేశారు. కాగా ఈ నెలలో సూరత్లోని విద్యాసంస్థల్లో కరోనా కలకలం చెలరేగడం ఇది రెండోసారి. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో కూడా కొందరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ పాఠశాలను తాత్కాలికంగా మూసివేశారు.