ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు (NCP) జయంత్ పాటిల్కు (Jayant Patil) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. మనీలాండరింగ్ (Money laundering) వ్యవహారంలో శుక్రవారం (ఈనెల 12న) విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (IL&FS) స్కామ్ కేసులో పాటిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే నవనిర్మాన్ సేన రాజ్ థాక్రేను (Raj Thackeray) ఈడీ ప్రశ్నించింది.
కోహినూర్ సీటీఎన్ఎల్ (Kohinoor CTNL) పెట్టుబడుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ సంస్థకు ఎల్ఎఫ్ అండ్ ఎఫ్ పెట్టుబడులు సమకూర్చించిందని, అయితే కోహినూర్ కన్స్ట్రక్షన్స్ తిరిగి ఆ సొమ్మును చెల్లించకపోవడంతో డీఫాల్టర్గా ప్రకటించారని పేర్కోంది. ఈ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, కోహినూర్ సీటీఎన్ఎల్ దాదర్ వెస్ట్లో కోహినూర్ స్క్వేయర్ పేరుతో భారీ టవర్ను నిర్మిస్తున్నది.