Enforcement Directorate | జార్ఖండ్ మైనింగ్ కేసులో ఆ రాష్ట్ర సాహిబ్ గంజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) రామ్ నివాస్ యాదవ్ నివాసంలో రూ.7.25 లక్షల నగదుతోపాటు రూ.36.99 లక్షల విలువైన పత్రాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్నది. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీడియా సలహాదారు రాం నివాస్ యాదవ్ ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసిన మరుసటి రోజు డబ్బుతోపాటు కీలక పత్రాలు జప్తు చేసినట్లు తెలిపింది.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేసిన వాటిలో 9ఎంఎం బోర్ 19 క్యాట్రిడ్జ్లు, 380 ఎంఎం క్యాట్రిడ్జ్ లు రెండు, ఐదు ఖాళీ 0.45 పిస్టళ్లను రాం నివాస్ యాదవ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. బుధవారం పొడవునా జరిగిన తనిఖీల్లో దొరికిన 30 బినామీ బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లను జప్తు చేయడంతోపాటు సదరు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపింది.
జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోని రాం నివాస్ యాదవ్ నివాసాలు, కార్యాలయాల్లో బుధవారం ఈడీ తనికీలు చేసింది. చట్టవిరుద్ధంగా జరిగిన స్టోన్ మైనింగ్ కేసులో రూ.1000 కోట్లకు పైగా చేతులు మారి ఉండొచ్చునని ఈడీ అధికారులు తెలిపారు. దీనిపై చర్యలు తప్పక తీసుకుంటామన్నారు.