న్యూఢిల్లీ, జనవరి 6: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మీడియా సలహాదారుడు, సభిగంజ్ డిప్యూటీ కమిషనర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
రూ.1000 కోట్ల అక్రమ మైనింగ్ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడిన సీఎం సలహాదారు అభిషేక్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రామ్ నివాస్ యాదవ్ ఈ నెల 16, 11 తేదీల్లో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే బినోద్ సింగ్ అనే వ్యక్తికి 15న రావాలంటూ నోటీసు ఇచ్చింది. కాగా, ఇదే కేసుకు సంబంధించి సాహిబ్గంజ్ డీఎస్పీ రాజేంద్ర దూబే, మరికొందరి ఇండ్లపై ఈడీ ఈ నెల 3న దాడులు నిర్వహించింది.