న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదల మధ్య ఎన్నికల్లో ర్యాలీలు, రోడ్షోలు, బైక్ర్యాలీలు, పాదయాతలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. కరోనా వైరస్ కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో సమీక్షించిన తరువాత ఈ నెల 22న నిషేధాన్ని 31వ తేదీ వరకు పొడిగించింది.
అయితే, ఫిబ్రవరి 10న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి, 14న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చింది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సమీక్ష నిర్వహించనున్నది. వర్చుల్ విధానం ఉదయం 11 గంటలకు సమావేశం జరుగనున్నది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి, కేసులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోనున్నది. వర్చువల్ మీటింగ్లో పోలింగ్ జరగనున్న రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, ఆరోగ్య కార్యదర్శులు హాజరయ్యే అవకాశం ఉంది.