చెన్నై, ఆగస్టు 13: వేర్వేరు ఘటనల్లో కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్పోర్టులో 10 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.111 కోట్లు విలువ ఉంటుందని చెబుతున్నారు. అంగోలాకు చెందిన మహిళ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. మొదటి ఘటనలో అడిస్ అబాబా నుంచి వచ్చిన వ్యక్తి క్యాబిన్ బ్యాగేజీ, షూస్, చెప్పుల్లో దాచిన 9.59 కేజీల కొకైన్, హెరాయిన్ను గుర్తించారు. వీటి విలువ 100 కోట్లు ఉంటుందని చెప్పారు. మరో ఘటనలో రూ.11.41 కోట్ల విలువైన 1.18 కేజీల కొకైన్ను అంగోలాకు చెందిన మహిళ నుంచి స్వాధీనం చేసుకున్నారు.