న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్టాప్ పథకం అమలవుతున్నదంటూ బూటకపు వార్తలను కొన్ని సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లు ప్రచారం చేస్తున్నాయని ఏఐసీటీఈ తెలిపింది. ఈ పథకంతో ఏఐసీటీఈకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి ప్రకటనలను పట్టించుకోవద్దని అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, విద్యార్థులను కోరింది. ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సరైన సమాచారం కోసం ఏఐసీటీఈ వెబ్సైట్ : httpS:l/www.aicte-india.orgను సందర్శించవచ్చు.