బెంగళూరు, నవంబర్ 29: కర్ణాటకలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి కడుపులో నుంచి 187 కాయిన్స్ బయటపడ్డాయి. కడుపునొప్పితో బాధపడుతూ దవాఖానలో చేరిన వ్యక్తికి ఆపరేషన్ చేసి, 1.5 కిలోగ్రాముల కాయిన్స్ను వైద్యులు తొలగించారు. రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్కు చెందిన ద్యామప్ప హరిజన్ (58)కు పికా జబ్బు ఉంది. ఇది ఒక తిండి రుగ్మత. దీనితో బాధపడుతున్నవారు తినే పదార్థాలు కాకుండా గడ్డి, బొమ్మలు, సుద్దముక్కలు, ఇతర గట్టి పదార్థాలను తింటుంటారు. ద్యామప్ప రూ.1, 2, 5 నాణేలను తిన్నాడు. ఓ రోజు విపరీతమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించారు. ఎక్స్రే, ఎండోస్కోపీ చేసిన వైద్యులు ద్యామప్ప కడుపులో కాయిన్స్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే డాక్టర్లు శస్త్రచికిత్స చేసి, వాటిని తొలగించారు.