జైపూర్: గుండె సర్జరీ చేసిన డాక్టర్లు శరీరంలోనే సర్జికల్ కత్తుల్ని(Surgical Scissors) వదిలివేసినట్లు రాజస్థాన్కు చెందిన కుటుంబం ఆరోపించింది. జైపూర్లోని ఫోర్టిస్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయినట్లు ఓ వ్యక్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఆపరేషన్ తర్వాత తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, సర్జరీ జరిగిన 12 రోజుల తర్వాత అతను చనిపోయాడని, దహనం తర్వాత చితాభస్మం కోసం శ్మశానవాటికకు వెళ్తే ఆ ప్రాంతంలో సర్జికల్ కత్తులు దొరికినట్లు ఆ వ్యక్తి ఆరోపించాడు. ఆ కుటుంబం హాస్పిటల్కు ఫిర్యాదు చేస్తే వాళ్లు ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. జవహార్ సర్కిల్ పోలీసు స్టేషన్లో ఆ ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది.
నగరంలోని మాన్సరోవర్ ఏరియాకు చెందిన కమల్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు ఇచ్చాడు. ఫోర్టిస్ హాస్పిటల్ జోనల్ డైరెక్టర్ నీరవ్ భన్సల్ ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. తమ వద్ద సర్జరీ జరిగిన తర్వాత ఎక్స్రే రిపోర్టులు ఉన్నాయన్నారు. చనిపోయిన వ్యక్తి శరీరంలో ఎటువంటి సర్జికల్ వస్తువులు లేవన్నారు. అయితే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా ఆధర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఫిర్యాదుపై కమిటీ దర్యాప్తు చేపట్టనున్నది.