రాంచీ: ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లైట్ పనిచేయలేదు. దీంతో సమీపంలోని పాన్పాష్లో టార్చ్ కొనుగోలు చేసి ఆ గుడ్డి వెలుగులో మహిళకు సిజేరియన్ నిర్వహించారు. జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సదర్లో ప్రభుత్వ హాస్పిటల్ను కోట్లు వెచ్చి నిర్మించారు. అయితే అందులో సౌకర్యాల లేమిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ థియేటర్లోని లైట్ గత కొన్ని రోజులుగా పని చేయడం లేదు. దానిని రిపేర్ చేయకపోగా వైద్యులు టార్చి వెలుగులో సర్జరీలు నిర్వహిస్తున్నారు.
తాజాగా నిండు గర్భిణీ ప్రసవం కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. అయితే ఆపరేషన్ థియేటర్లోని లైట్ పని చేయకపోవడంతో సమీపంలోని పాన్షాప్ నుంచి టార్చ్ కొనుగోలు చేశారు. డాక్టర్లు ఆ గుడ్డి వెలుతురులో ఆ మహిళకు సిజేరియన్ చేశారు. దీంతో ఆ మహిళ కుటుంబం ఆందోళన చెందింది. అయితే తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊరటచెందారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాహణపై విమర్శలు వెల్లువెత్తాయి.