న్యూఢిల్లీ, మార్చి 7: చైనాతో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) విషయమై సైనిక ప్రతిష్ఠంభన నెలకొనటంతో భారత సైనికులు, వారి కుటుంబ సభ్యులు చైనా మొబైల్ ఫోన్లను వాడొద్దని భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి.
శత్రు దేశాలకు చెందిన ఫోన్లలో (చైనా) అక్రమంగా మాల్వేర్, స్పైవేర్ (సమాచారాన్ని దొంగిలించే వైరస్, సాఫ్ట్వేర్) జొప్పించినట్టు తమకు తెలిసిందని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. గతంలో ఇలాంటి సందేహాస్పద అప్లికేషన్లను సైన్యం ఫోన్ల నుంచి తొలగించారు. గతంలో రక్షణ దళాలు కూడా చైనా ఫోన్లను వాడటం మానేశాయి.