చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉధయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రవేశించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14న (బుధవారం) తమిళనాడు రాజ్భవన్లో జరిగే కార్యక్రమంలో ఉధయనిధి మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఈ విషయాన్ని సోమవారం రాజ్భవన్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. రాష్ట్ర మంత్రివర్గంలోకి ఉధయనిధిని తీసుకోవాలంటూ ఇటీవల డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసుకు గవర్నర్ సీటీ రవి ఆమోదం తెలిపారు. దాంతో ఈ నెల 14న మంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
తమిళ నటుడు, నిర్మాత, పంపిణీదారుడు అయిన ఉధయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఉధయనిధికి మంత్రి పదవి కట్టబెట్టాలని ఇటీవల డిమాండ్లు పెరగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే పార్టీ ప్రకటించింది.