లక్నో: ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారంలోకి వచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్, మళ్లీ బుల్డోజర్కు పని చెప్పారు. తాజాగా అధికారులు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యేకు చెందిన పెట్రోల్ బంక్ను జేసీబీతో కూల్చివేశారు. బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం ఇటీవల కొత్తగా పెట్రోల్ బంక్ను నిర్మించారు. అయితే మ్యాప్ అప్రూవల్ లేకుండా దీనిని నిర్మించారని బరేలీ జిల్లా అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాంకు చెందిన పెట్రోల్ బంక్ను జేసీబీతో కూల్చివేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నది. అవినీతి, అక్రమాలను సహించేది లేదంటూ విపక్ష పార్టీల నేతలకు చెందిన ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చర్యలను ఆపివేసింది. దీంతో ఎన్నికల కోసమే బుల్డోజర్లను వినియోగించడం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా విమర్శించారు. సీఎం యోగిని బుల్డోజర్ బాబాగా అభివర్ణించారు.
అయితే బుల్డోజర్లు విశ్రాంతి తీసుకుంటున్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత వాటికి పని చెబుతామంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అవినీతి, అక్రమాల పేరుతో ప్రతిపక్ష నేతలకు చెందిన ఆస్తులను జేసీబీలతో ధ్వంసం చేస్తున్నారు.
#WATCH: UP | District admin in Bareilly demolishes a petrol pump owned by SP MLA Shazil Islam. The petrol pump was allegedly constructed without a map approval. pic.twitter.com/qhkfp6l3So
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 7, 2022