న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరక్టర్ జనరల్గా ఆయన అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. ఇవాళ కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఎన్ఐఏ డీజీ వైసీ మోదీ ఈనెల 31న పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కుల్దీప్ సింగ్కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు హోంశాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.