Digital healthcare ID | ఆధార్ కార్డ్ మాదిరిగా త్వరలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్కేర్ ఐడీ అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక స్కీం ప్రధాన్మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పీఎం-డీహెచ్ఎం) ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పైలట్ ప్రాజెక్టుగా పీఎం-డీహెచ్ఎంను ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయూ, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఈ పథకం అమలవుతున్నది.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) తృతీయ వార్షికోత్సవ సంబురాలను నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) జరుపుకుంటున్న వేళ జాతీయ స్థాయిలో పీఎం-డీహెచ్ఎం ప్రారంభం కావడం యాదృచ్చికం అని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.