న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారతదేశంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాంకేతికత పేరుతో పేదలను విస్మరిస్తున్నదని ప్రముఖ మ్యాగజైన్ ‘ది ఎకనమిస్ట్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘భారత ప్రభుత్వం అన్ని సమస్యలకు హైటెక్ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నది. కానీ దేశంలో చాలా మందికి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కరెంటు లేదు. స్మార్ట్ ఫోన్లు లేవు. ఇది డిజిటల్ డివైడ్కు దారి తీస్తున్నది’ అని అందులో వ్యాఖ్యానించింది. ఈ నెల 16న ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ ఆర్టికల్పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది వాస్తవానికి భిన్నంగా, పూర్తి పక్షపాత వైఖరితో ఉందని ఖండించింది.