హైదరాబాద్ : సరైన డైట్, న్యూట్రిషన్, చక్కటి ఆరోగ్యం వంటి అంశాలపై సమాజానికి అవగాహన కల్పించడానికి ఇండియన్ డైటిటిక్ అసోసియేషన్ (ఐడీఏ) 2013లోనే శ్రీకారం చుట్టింది. అందులో
భాగంగా దేశవ్యాప్తంగా” డైటిటిక్స్ డే” ను నిర్వహిస్తుంది. పరిశోధనాధారిత గ్లోబల్ క్లీనికల్ న్యూట్రిషన్ సంస్థ ఎస్పెరర్ న్యూట్రిషన్ (ఈఓఎన్)ఈ సంవత్సరం ఐడీఏతో కలిసి హైదరాబాద్లోని హయత్ ప్లేస్ హోటల్లో ఈ వేడుకలను నిర్వహించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ఆర్ హేమలత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రతి సంవత్సం ఐడీఏ సూచనలకనుగుణంగా అవగాహన కల్పించేందుకు పలు అంశాలను ఎంచుకుంటుంటారు. దీనిలో భాగంగా ఫెయిర్స్,బుక్ స్టోర్లు, కేఫ్లు,స్కూల్స్,హాస్పిటల్స్లో పలు ఉపన్యాసాలు,వాక్స్, పోటీలను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పెరర్ న్యూట్రిషన్ ఫౌండర్ అండ్ సీఈవో చటోపాధ్యాయ మాట్లాడుతూ ‘‘సరైన డైట్, న్యూట్రిషన్, చక్కటి ఆరోగ్యం పట్ల తగిన అవగాహన కల్పించేందుకు ఐడీఏ తెలంగాణ చాప్టర్ ఇప్పుడు డైటెటిక్స్ డే- 2022ను నిర్వహించింది. ఎస్పెరర్ న్యూట్రి షన్ ఇమ్యునోమాడ్యులేటరీ థెరపాటిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్ పోర్ట్ఫోలియో టీమ్ ఎనోర్మా ఈ కార్యక్రమానికి ఆతిథ్యం అందించింది’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్ న్యూట్రిషియనిస్ట్ పోటీలు జరిగాయి. అనంతరం న్యూట్రిషియనిస్ట్స్ తోపాటు డైటీషియన్స్కు అవార్డులను అందజేశారు.