ముంబై : మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి ఇటీవల శివాజీపై చేసిన కామెంట్ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి గడ్కరీ సన్మానం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత రోజుల్లో శివాజీ ఐకాన్ అని, కానీ ఇప్పటి రోజుల్లో అంబేద్కర్, గడ్కరీ ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో గొప్ప వ్యక్తులు అంటే నెహ్రూ, చంద్రబోస్, గాంధీ పేర్లు మాత్రమే వినిపించేవని ఆయన అన్నారు. అయితే కోశ్యారి చేసిన వ్యాఖ్యలను ఇవాళ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ భార్య సమర్థించారు.
గవర్నర్ తనకు వ్యక్తిగతంగా తెలుసు అని, మహారాష్ట్ర వచ్చిన తర్వాత ఆయన మరాఠీ నేర్చుకున్నాడని, ఆయన మరాఠీలను నిజంగానే ఇష్టపడుతారని, స్వయంగా చూశానని, ఆయన ఏది మాట్లాడినా.. మరో రకంగా అర్ధాలు తీస్తున్నారని, ఆయన గుండెలో మరాఠీలు ఉన్నట్లు అమృతా ఫడ్నవీస్ తెలిపారు.
ప్రతిపక్షాలు మాత్రం గవర్నర్ కోశ్యారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కోశ్యారి మహారాష్ట్రకు అమెజాన్ ద్వారా వచ్చిన పార్సిల్ అని ఉద్దవ్ విమర్శించారు.